Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 25 నవంబరు 2024 (10:23 IST)
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో 22 ఏళ్ల టీచర్ తన మాజీ ప్రేమికుడి వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. కాగితాల రాశి అనే బాధితురాలు భీమిలి మండలం మజ్జివలస గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్‌గా పని చేస్తోంది. ఆమె నవంబర్ 16న ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఆ రోజు సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26)ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
భీమిలి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం రాజు, రాశి మధ్య సుమారు 11 ఏళ్లుగా సంబంధం ఉంది. రాశి తల్లిదండ్రులు వారి వివాహాన్ని వ్యతిరేకించడంతో పరిస్థితి మరింత దిగజారింది. 
 
తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని నిందితుడు బెదిరించాడని భీమిలి ఎస్‌ఐ తెలిపారు. రాజును నవంబర్ 22న అరెస్టు చేసి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. రాజు కొన్నాళ్లుగా ప్రేమ నెపంతో ఆమెను వేధిస్తున్నాడని తెలుస్తోంది. 
 
తొలుత ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన కుటుంబ సభ్యులు భీమిలి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments