Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 25 నవంబరు 2024 (10:23 IST)
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో 22 ఏళ్ల టీచర్ తన మాజీ ప్రేమికుడి వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. కాగితాల రాశి అనే బాధితురాలు భీమిలి మండలం మజ్జివలస గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్‌గా పని చేస్తోంది. ఆమె నవంబర్ 16న ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఆ రోజు సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26)ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
భీమిలి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం రాజు, రాశి మధ్య సుమారు 11 ఏళ్లుగా సంబంధం ఉంది. రాశి తల్లిదండ్రులు వారి వివాహాన్ని వ్యతిరేకించడంతో పరిస్థితి మరింత దిగజారింది. 
 
తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని నిందితుడు బెదిరించాడని భీమిలి ఎస్‌ఐ తెలిపారు. రాజును నవంబర్ 22న అరెస్టు చేసి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. రాజు కొన్నాళ్లుగా ప్రేమ నెపంతో ఆమెను వేధిస్తున్నాడని తెలుస్తోంది. 
 
తొలుత ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన కుటుంబ సభ్యులు భీమిలి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments