Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ - సికింద్రాబాద్‌ల మధ్య వారంలో ఆరు రోజులే వందేభారత్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (09:21 IST)
సికింద్రాబాద్ - వైజాగ్ స్టేషన్ల మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఈ రైలు సేవలను ప్రారంభిస్తారు. అయితే, ఈ రైలు ఈ రెండు స్టేషన్ల మధ్య వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఆదివారం మాత్రం రైలు సేవలు ఉండవని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
 
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్టణంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌‍లో బయలుదేరి విశాఖపట్టణానికి రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రం ఆగుతుంది. 
 
విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందే భారత్ రైలు రాజమండ్రికి 7.55/7.57కు, విజయవాడకు 10/10.05, ఖమ్మంకు 11/11.01, వరంగల్‌కు మధ్యాహ్నం 12.05/12.06, సికింద్రాబాద్‌కు 14.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 15.00 గంటలకు బయలుదేరి వరంగల్‌కు సాయంత్రం 16.35/16.36, ఖమ్మంకు 17.45/17.46, విజయవాడకు 19.00/19.05, రాజమండ్రికి 20.58/21.00. విశాఖపట్టణంకు 23.30 గంటలకు చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం

తెలుగులో టోవినో థామస్, త్రిష యాక్షన్ త్రిల్లర్ ఐడెంటిటీ

జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో నేను హర్ట్ అయ్యా, వదిలిపెట్టను: నటి మాధవీ లత

Chiranjeevi: డియర్ తమన్ నీ మాటలు హృదయాన్ని తాకేలా వున్నాయ్: చిరంజీవి

అభిమాని కుటుంబంలో వెలుగునింపిన రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments