Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ - సికింద్రాబాద్‌ల మధ్య వారంలో ఆరు రోజులే వందేభారత్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (09:21 IST)
సికింద్రాబాద్ - వైజాగ్ స్టేషన్ల మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఈ రైలు సేవలను ప్రారంభిస్తారు. అయితే, ఈ రైలు ఈ రెండు స్టేషన్ల మధ్య వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఆదివారం మాత్రం రైలు సేవలు ఉండవని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
 
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్టణంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌‍లో బయలుదేరి విశాఖపట్టణానికి రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రం ఆగుతుంది. 
 
విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందే భారత్ రైలు రాజమండ్రికి 7.55/7.57కు, విజయవాడకు 10/10.05, ఖమ్మంకు 11/11.01, వరంగల్‌కు మధ్యాహ్నం 12.05/12.06, సికింద్రాబాద్‌కు 14.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 15.00 గంటలకు బయలుదేరి వరంగల్‌కు సాయంత్రం 16.35/16.36, ఖమ్మంకు 17.45/17.46, విజయవాడకు 19.00/19.05, రాజమండ్రికి 20.58/21.00. విశాఖపట్టణంకు 23.30 గంటలకు చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments