Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్టణంలో డ్రగ్స్ దందా - ఐదుగురి అరెస్టు

drugs
Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (15:56 IST)
విశాఖపట్టణం నగరంలో డ్రగ్స్ దందా ఒకటి వెలుగు చూసింది. నగరంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించి ఐదుగురు ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో నలుగురు యువకులు విశాఖకు చెందినవారు కూడా, మరో వ్యక్తి బెంగుళూరు వారి. దిలీప్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ డ్రగ్స్‌దందాకు విశాఖ, గోవాల మధ్య సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అరెస్టు చేసినవారిలో విశాఖకు చెందిన వాసుదేవ, మోజెస్, రవికుమార్, కిశోర్, బెంగళూరుకు చెందిన సందీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డ్రగ్స్, ఐదు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో దిలీప్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 
 
దీనిపై నగర పోలీస్ కమిషనర్ వివరాలు తెలిపారు. రవికుమార్ గంజాయిని గోవాలో ఉండే దిలీప్ కు అందించేవాడని వెల్లడించారు. దిలీప్ ద్వారా డ్రగ్స్ విశాఖకు తీసుకొచ్చి అమ్మేవారని వివరించారు. ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూపులు, డార్క్ వెబ్ ద్వారా విక్రయం జరిపేవారని పోలీస్ కమిషనర్ తెలిపారు. క్రిప్టో కరెన్సీ, యూపీఐ ఆధారిత చెల్లింపుల సాయంతో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments