Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఐడీకి విశాఖ కోర్టులో చుక్కెదురు.. అయన్న రిమాండ్‌కు తిరస్కృతి

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (20:02 IST)
టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని, ఆయన ఇద్దరు కుమారులను ఫోర్జరీ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విశాఖ కోర్టులో గురువారం సాయంత్రం హాజరుపరిచారు. అయితే, వారిని రిమాండ్‌కు తరలించేందుకు మేజిస్ట్రేట్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. 2 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్నారన్న అభియోగాలతో వారిని గురువారం తెల్లవారుజామున ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. 
 
వీరిని విశాఖపట్టణం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచగా, ఈ కేసులో ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని మేజిస్ట్రేట్ పేర్కొంటూ, వారిద్దరికి రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. పైగా, నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేష్‌కు కోర్టు బెయిల్ మంజూరుచేసింది. 
 
2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేషఅ‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, అక్కడ చుక్కెదురైంది. దీంతో నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments