Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఐడీకి విశాఖ కోర్టులో చుక్కెదురు.. అయన్న రిమాండ్‌కు తిరస్కృతి

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (20:02 IST)
టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని, ఆయన ఇద్దరు కుమారులను ఫోర్జరీ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విశాఖ కోర్టులో గురువారం సాయంత్రం హాజరుపరిచారు. అయితే, వారిని రిమాండ్‌కు తరలించేందుకు మేజిస్ట్రేట్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. 2 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్నారన్న అభియోగాలతో వారిని గురువారం తెల్లవారుజామున ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. 
 
వీరిని విశాఖపట్టణం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచగా, ఈ కేసులో ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని మేజిస్ట్రేట్ పేర్కొంటూ, వారిద్దరికి రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. పైగా, నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేష్‌కు కోర్టు బెయిల్ మంజూరుచేసింది. 
 
2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేషఅ‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, అక్కడ చుక్కెదురైంది. దీంతో నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments