Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఐడీకి విశాఖ కోర్టులో చుక్కెదురు.. అయన్న రిమాండ్‌కు తిరస్కృతి

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (20:02 IST)
టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని, ఆయన ఇద్దరు కుమారులను ఫోర్జరీ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విశాఖ కోర్టులో గురువారం సాయంత్రం హాజరుపరిచారు. అయితే, వారిని రిమాండ్‌కు తరలించేందుకు మేజిస్ట్రేట్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. 2 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్నారన్న అభియోగాలతో వారిని గురువారం తెల్లవారుజామున ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. 
 
వీరిని విశాఖపట్టణం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచగా, ఈ కేసులో ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని మేజిస్ట్రేట్ పేర్కొంటూ, వారిద్దరికి రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. పైగా, నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేష్‌కు కోర్టు బెయిల్ మంజూరుచేసింది. 
 
2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేషఅ‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, అక్కడ చుక్కెదురైంది. దీంతో నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

ఈ ఏడాది సక్సెస్ లు పెద్దగా లేవు, పారితోషికం గురించి అందరూ ఆలోచించాలి: దిల్ రాజు

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments