Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు సరైన చర్య కాకుంటే ప్రజలే చెప్పుతో కొడతారు : బీజేపీ ఎంపీ

దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైన చర్య కాకుంటే ప్రజలే తమకు తగిన బుద్ధి చెప్పేలా చెప్పుతో కొడతారని భారతీయ జనతా పార్టీకి చెందిన విశాఖపట్టణం ఎంపీ హరిబాబు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (11:27 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైన చర్య కాకుంటే ప్రజలే తమకు తగిన బుద్ధి చెప్పేలా చెప్పుతో కొడతారని భారతీయ జనతా పార్టీకి చెందిన విశాఖపట్టణం ఎంపీ హరిబాబు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరైంది కాకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని, అలాగే నోట్లను దారిమళ్లించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
దేశంలో పెరిగిపోతున్న నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకే నోట్ల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో చర్చించకుండా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయన్నారు. నల్లధన కుబేరులు కాంగ్రెస్ పార్టీలోనే అధికంగా ఉన్నారన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటూ ఆరోపించారు.
 
కాగా, జాతీయ గీతంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ప్రభుత్వానికి సంబంధం లేదని, ఏ యూనివర్సిటీ విషయంలో బీజేపీ జోక్యం చేసుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌కు పరోక్షంగా హరిబాబు కౌంటర్ ఇచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments