తెదేపా పని అయిపోయిందనుకున్నా ... గంటా శ్రీనివాసరావు

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (19:16 IST)
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అనుకున్న సమయంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు వచ్చి పార్టీలో చేరడం శుభపరిణామం అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన దాదాపు 300 మందికి పైగా కార్యకర్తలు, నేతలు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ, పార్టీ పని అయిపోయిందని భావిస్తున్న సమయంలో బీజేపీ నుంచి 300 మంది టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు జరిగి పార్టీ మరింత బలపడాలని ఆశిస్తున్నానని అన్నారు. ప్రస్తుత చేరికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత బలాన్ని ఇస్తుందని అన్నారు. 
 
ఈనెల 19 నుంచి వార్డుల వారీగా 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని గంటా తెలిపారు. అయితే తాము టార్గెట్ చేసి ఎవరినీ పార్టీలోకి చేర్చుకోవడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అన్ని పార్టీల నుంచి టీడీపీలోకి చేరికలుంటాయని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments