Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా ఇంటికి మీరెన్ని గంటలకు వెళ్లారు.. ఆ రోజు ఏం జరిగింది.. సీబీఐ ప్రశ్నలు

Webdunia
బుధవారం, 3 మే 2023 (09:04 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరిన్ని పక్కా ఆధారాలను సేకరించేందుకు సీబీఐ ముమ్మర కసరత్తు చేసుంది. ఇందులోభాగంగా, వివేకా వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కృష్ణారెడ్డి వద్ద మరోమారు ఐదు గంటల పాటు విచారణ జరిపారు. హైదరాబాద్‌లోని  సీబీఐ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ఇందులో వివేకా హత్య జరిగిన రోజున ఏం జరిగింది? ఆ రోజున వివేకా ఇంటికి మీరు ఎన్ని గంటలకు వెళ్లారు? వెళ్లాక అక్కడ మొదట ఏం చూశారు?, విషయం ఎవరెవరికి చెప్పారు? ముందుగా అక్కడకు వచ్చిందెవరు? ఆ లేఖలే ఏముంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఇప్పటివరకు కస్టడీలో ఉన్న నిందితులను ప్రశ్నించిన సీబీఐ.. సాక్షులుగా ఉన్న వారినీ పిలిచి విచారిస్తోంది. ఇప్పుడు కృష్ణారెడ్డి వంతు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు ఐదు గంటలపాటు ప్రత్యేక బృందం కృష్ణారెడ్డిని విచారించింది. హత్య విషయం తెలుసుకున్న వైఎస్ అవినాశి రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్న తర్వాత ఏం మాట్లాడారు.. ఏం చేశారని అడిగినట్లు సమాచారం. 
 
'వివేకా గదిలో గుర్తించిన లేఖలో ఏం రాసి ఉంది.. అందులో ఉన్న విషయం మీరు ఎవరెవరికి చెప్పారు? ఎవరి ఆదేశాల మేరకు లేఖ దాచారు.. ఇంట్లో గుర్తించిన సెల్ఫోన్ ఎవరిది' ఇలా అనేక అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments