విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ? ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగులకు అందించడమేంటి?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (09:07 IST)
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ?...ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల కు అందించడమేంటి? బొత్తిగా అర్ధమే కావడం లేదు కదూ...!!. వివరాల్లోకి వెళ్తే.... ఇనుమును తయారు చేసే క్రమంలో భూమిలో దొరికే హెమటైట్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఓర్(Fe2O3)ను స్టీల్‌గా మార్చాలి అంటే 2000 డిగ్రీల సెల్సీయస్ వద్ద బ్లాస్ట్ ఫర్నేస్‌లో దానిని మండించి కరిగించాల్సి వుంటుంది. 
  
ఈ ప్రక్రియలో కర్బన సమ్మెళనమైన "కోక్ "ను మరియు ఐరన్ ఓర్‌ను దానికి కాల్షియం కార్బోనేట్‌ను కలిపి మండిస్తూ ఇనుమును వేరు చేయడానికి ఆక్సిజన్‌ను రసాయన ప్రక్రియ కోసం ఫర్నేస్‌లోకి పంపుతారు.. అంటే హెమటైట్ ముడి ఖనిజం నుండి స్టీల్ వేరు కావడానికి ఆక్సిజన్ (O2) కావాలన్నమాట.
 
మరి దానికి కావలసిన ఆక్సిజన్ ఎక్కడినుండి తేవాలీ? అందుకే స్టీల్ ఫ్యాక్టరీ సొంతంగా ఆక్సిజన్ తయారీ యూనిట్‌ను నెలకొల్పుకుంది. సరిగ్గా ఈ ఆక్సిజన్ తయారీ యూనిట్ నుండే మనకు ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల ప్రాణాలు నిలపడానికి సరఫరా చేస్తోంది.

వాతావరణం లోని గాలిలో 21% ఆక్సిజన్ మరియు 78% నైట్రోజన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. Air compressor ద్వారా గాలిని తీసుకొని మలినాలు వేరుచేస్తారు. ప్రత్యేక కోల్ టవర్ ద్వారా మలినాలు వేరు చేసి జియోలైట్ బెడ్‌తో నింపబడిన PSA generator ద్వారా నైట్రొజన్‌ను వేరు చేసి ఆక్సిజన్ సేకరిస్తారు. ఇలా పలుమార్లు శుధ్ధీకరించబడిన ఆక్సిజన్‌ను మెడికల్ ఆక్సిజన్‌గా సిలిండర్లలొ నింపి సరఫరా చేస్తారన్నమాట.
 
ఇదిలా వుంటే లిక్విడ్ నైట్రోజన్‌ను అతి శీతలీకారిణిగా వాడతారు. అంటే మన గ్రామాలలో మొన్నటివరకు "గోపాలమిత్ర"లు పెద్దపెద్ద ఫ్లాస్క్‌లు తీసుకొచ్చేవారు గుర్తుందా? మూత తీయగానే పొగలు వస్తుండేవి.. అదే లిక్విడ్ నైట్రొజన్ అన్నమాట. (పశువుల వీర్యాన్ని దీంట్లో నిల్వ చేస్తారు)
 
ఇదన్నమాట కధ...
"యాభైరెండు అంగుళాల ఛాతీ"కి కూడా అవసరమైతే ఊపిరిలూదడానికి సిద్దంగా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు. ఏదేమైనా ఊపిరి తీయాలనుకున్న సంస్థే నేడు దేశప్రజలకు ప్రాణాలువాయువును అందించి ప్రజల ప్రాణాలు నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు....

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments