Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హోదా' కోసం విచిత్ర వేషాధారణతో పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు వివిధ రకాల నిరసనలు తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు వివిధ రకాల నిరసనలు తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే విచిత్ర విషాధారణతో పీఠాధిపతి అవతారమెత్తారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత వాసుపల్లి గణేశ్ కుమార్ ఖద్దరు వదిలి... కాషాయం వస్త్రాలు ధరించారు. ఆ తర్వాత ఆయన పీఠాధిపతి అవతారం ఎత్తారు. అంతటితో ఆయన ఆగలేదు కదా.. పీఠాధిపతి అవతారంలోనే బీజేపీ నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నివాసానికి గణేశ్ కుమార్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. 
 
మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే విచిత్ర వేషధారణలో తన ఇంటికి రావడంతో తొలుత షాక్ తిన్న విష్ణు... ఆ తర్వాత ఆయనను సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ పీఠాధిపతులకు ఇస్తున్న గౌరవం ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకోసమే పీఠాధిపతి వేషంలో బీజేపీ ఎమ్మెల్యేను కలిశానని చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments