Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ HPCL అగ్ని ప్రమాదం: 20 అగ్నిమాపక యంత్రాలు, నావికాదళం, పోలీసులతో అదుపులోకి..

Webdunia
మంగళవారం, 25 మే 2021 (18:06 IST)
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ HPCL రిఫైనరీస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు పావుగంటలో చేరుకున్నాయి. మొత్తం 20 అగ్నిమాపక శకటాలు, నావికాదళం, పోలీసులు రంగప్రవేశం చేసి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
 
ఓవర్‌హెడ్ పైప్‌లైన్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. సిడియులోని మూడవ యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్‌హెడ్ పైప్‌లైన్ దెబ్బతినడంతో ఈ ప్రమాదం జరిగిందని కలెక్టర్ వివరించారు. యూనిట్ మొత్తం మూసివేసినట్లు తెలిపారు.
 
పరిస్థితి అదుపులో ఉందనీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే సమాచారం అందిందని, వెంటనే అంతా అప్రమత్తమయ్యారని చెప్పారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments