సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

ఠాగూర్
ఆదివారం, 7 డిశెంబరు 2025 (13:44 IST)
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆదివారం విశాఖపట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న)ని దర్శనం చేసుకున్నారు. ఆలయానికి చేరుకున్న కోహ్లీకి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కోహ్లీ గర్భాలయంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఆ తర్వాత ఆలయంలో విశిష్టత కలిగిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. దర్శనం పూర్తయ్యాక ఆలయ అధికారులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం అధికారులు కోహ్లీని సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
కాగా, వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టు 2-0 తేడాతో గెలుచుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments