Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో పోవాలి.. సైకిల్ రావాలి... వైకాపా ఎమ్మెల్యేకు ఎంఎస్ బాబుకు షాక్

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (15:55 IST)
చిత్తూరు జిల్లా పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గ్రామస్థులు షాకిచ్చారు. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల తోరణాలు, టీడీపీ జెండాలు, గోడల నిండా 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పోస్టర్లు కనిపించాయి. ఆదేసమయంలో సైకో పోవాలి.. సైకిల్ రావాలి అనే పాట మైకులో హోరెత్తుతోంది. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. 
 
గురువారం బంగారుపాళ్యం మండలం మొగిలివా రిపల్లెలో ఈ పరిస్థితి ఎదురైంది. వైసీపీ నాయకులు జోక్యం చేసుకుని ఆ పాటను ఆపాలని గ్రామస్థులకు సూచించారు. వారు అంగీకరించలేదు. పైగా 'మా గ్రామానికి ఏం చేశారు? ఇప్పుడెందుకొచ్చారు? ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకున్నారా?' అంటూ కారులోంచి దిగని ఎమ్మెల్యేను గట్టిగా ప్రశ్నించారు. 
 
ఆ వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పాటను నిలిపి వేయించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో 90 ఇళ్లు ఉండగా, రెండు ఇళ్లకు వద్దకు మాత్రమే ఎమ్మెల్యే వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వెనుదిరిగారు. మొగిలివారిపల్లెలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఎదురైన నిరసన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments