Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో పోవాలి.. సైకిల్ రావాలి... వైకాపా ఎమ్మెల్యేకు ఎంఎస్ బాబుకు షాక్

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (15:55 IST)
చిత్తూరు జిల్లా పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గ్రామస్థులు షాకిచ్చారు. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల తోరణాలు, టీడీపీ జెండాలు, గోడల నిండా 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పోస్టర్లు కనిపించాయి. ఆదేసమయంలో సైకో పోవాలి.. సైకిల్ రావాలి అనే పాట మైకులో హోరెత్తుతోంది. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. 
 
గురువారం బంగారుపాళ్యం మండలం మొగిలివా రిపల్లెలో ఈ పరిస్థితి ఎదురైంది. వైసీపీ నాయకులు జోక్యం చేసుకుని ఆ పాటను ఆపాలని గ్రామస్థులకు సూచించారు. వారు అంగీకరించలేదు. పైగా 'మా గ్రామానికి ఏం చేశారు? ఇప్పుడెందుకొచ్చారు? ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకున్నారా?' అంటూ కారులోంచి దిగని ఎమ్మెల్యేను గట్టిగా ప్రశ్నించారు. 
 
ఆ వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పాటను నిలిపి వేయించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో 90 ఇళ్లు ఉండగా, రెండు ఇళ్లకు వద్దకు మాత్రమే ఎమ్మెల్యే వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వెనుదిరిగారు. మొగిలివారిపల్లెలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఎదురైన నిరసన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments