Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే సేవలు చాలు.. ఇక దయచేయండి.. సచివాలయానికి తాళం

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను అమలు చేస్తుంది. ప్రతి ఒక్క సేవను ప్రభుత్వం అందిస్తుంది. అయితే, పలు ప్రాంతాల్లో ఈ సచివాలయకు ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవలు చాలు.. ఇక దయచేయండి అంటూ సచివాలయానికి తాళం వేశారు. 
 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం డి.కోటకొండ పంచాయతీ పరిధిలో బైలుపత్తికొండ, గార్లపెంట మజరా గ్రామాలు ఉన్నాయి. డి.కోటకొండ గ్రామంలో మూడు వేలకు పైనే జనాభా ఉన్నారు. ప్రధాన కాలనీల్లో వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వీధులు కాలువలను తలపిస్తున్నాయి. 
 
శనివారం గ్రామస్థులు బాషా, బడేసాబ్‌, రాజాసాహెబ్‌, మల్లన్న, వీరేష్‌, రంగన్న, హనుమంతు, రత్నమ్మ, సారమ్మ, మలేశ్వరమ్మతో పాటు పిల్లలు, పెద్దలు అందరూ కలసి మూకుమ్మడిగా సచివాలయం వద్దకు వెళ్లి కార్యాలయానికి తాళం వేసి ఎదుట ధర్నా చేపట్టారు. 
 
వర్షం నీరు కాలనీల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల అధికారులకు చరవాణి ద్వారా సమాచారం అందించారు. సాయంత్రం వరకు మండల అధికారులు రాలేదు. సమస్య పరిష్కరించే వరకు గ్రామ సచివాలయం తెరవనివ్వమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments