Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

ఐవీఆర్
శుక్రవారం, 25 జులై 2025 (21:21 IST)
ప్రియురాలిని కలుసుకునేందుకు ఆ యువకుడు అర్థరాత్రి వేళ తచ్చాడుతూ వెళ్తున్నాడు. తనను ఎవరో గమనిస్తున్నారని తెలుసుకుని ఆ యువకుడు చెట్ల చాటున నక్కాడు. అంతే... గ్రామస్తులంతా ఒక్క ఉదుటన అతడిపై బడి చితక్కొట్టారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో అర్థరాత్రి వేళ సురేష్ అనే యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చాడు. ఐతే అతడు తన ప్రియురాలిని కలిసేలోపుగా అతడు కొంతమంది గ్రామస్తుల కంటబడ్డాడు. దాంతో ఊరు ఊరంతా కదిలివచ్చింది. అతడు దొంగ అనుకుని వెంటబడ్డారు. ఆ యువకుడు భయంతో ముళ్లపొదల్లో దాక్కున్నాడు.
 
గ్రామస్తులంతా ముళ్లపొదల్లో నక్కిన యువకుడిని బైటకు లాగి సమీపంలో వున్న కరెంట్ స్తంభానికి కట్టేసి అర్థరాత్రి వేళ ఎందుకొచ్చావని ప్రశ్నించారు. తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చానని చెబితే పరిస్థితి మరింత దిగజారుతుందని అతడు నోరు మెదపలేదు. దాంతో అంతా కలిసి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చానంటూ ఆ యువకుడు పోలీసుల వద్ద బావురుమంటూ ఏడ్చాడు. పోలీసులు అతడికి పలు ప్రశ్నలు వేసి... అతడు నిజంగానే ప్రియురాలి కోసం వచ్చాడని నిర్థారించి, ఆసుపత్రికి పంపించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments