Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొత్తం మార్కులు 2 వేలు... వేసిన మార్కులు 5,360

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (09:11 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ దశాబ్దపు వింత చోటుచేసుకుంది. మొత్తం మార్కులు 800 అయితే, జవాబు పత్రాల మూల్యాంకన తర్వాత వేసిన మార్కులు 5360. ఈ మార్కులను చూసిన సదరు విద్యార్థికి కళ్లు బైర్లు కమ్మాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ విశ్వవిద్యాలయంలో 8 నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను తాజాగా వెల్లడించారు. 8 నెలల తర్వాత ఫలితాలు వెల్లడించినప్పటికీ తప్పులు తడకగా ఉండటంపై విద్యార్థులు మండిపడుతున్నారు. 
 
మొత్తం మార్కులు 800 అయితే, పరీక్ష రాసిన విద్యార్థులందరికీ 2 వేలకు పైగా మార్కులు వచ్చాయి. ముఖ్యంగా ఓ విద్యార్థికి అయితే, ఏకంగా 5,362 మార్కులు వచ్చాయి. వీటిని చూసిన ఆ విద్యార్థి నోరెళ్లబెట్టాడు. 
 
జవాబు పత్రాల మూల్యాంకన, మార్కుల లెక్కింపులో యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా లేదు. ఈ ఘటనపై యూనవర్శిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, మార్కులు జాబితాలో తప్పులుంటే సవరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments