Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొత్తం మార్కులు 2 వేలు... వేసిన మార్కులు 5,360

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (09:11 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ దశాబ్దపు వింత చోటుచేసుకుంది. మొత్తం మార్కులు 800 అయితే, జవాబు పత్రాల మూల్యాంకన తర్వాత వేసిన మార్కులు 5360. ఈ మార్కులను చూసిన సదరు విద్యార్థికి కళ్లు బైర్లు కమ్మాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ విశ్వవిద్యాలయంలో 8 నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను తాజాగా వెల్లడించారు. 8 నెలల తర్వాత ఫలితాలు వెల్లడించినప్పటికీ తప్పులు తడకగా ఉండటంపై విద్యార్థులు మండిపడుతున్నారు. 
 
మొత్తం మార్కులు 800 అయితే, పరీక్ష రాసిన విద్యార్థులందరికీ 2 వేలకు పైగా మార్కులు వచ్చాయి. ముఖ్యంగా ఓ విద్యార్థికి అయితే, ఏకంగా 5,362 మార్కులు వచ్చాయి. వీటిని చూసిన ఆ విద్యార్థి నోరెళ్లబెట్టాడు. 
 
జవాబు పత్రాల మూల్యాంకన, మార్కుల లెక్కింపులో యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా లేదు. ఈ ఘటనపై యూనవర్శిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, మార్కులు జాబితాలో తప్పులుంటే సవరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments