Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనది ప్రజాస్వామ్యమా? సిగ్గుపడాల్సిన విషయం: విజయేంద్ర ప్రసాద్

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (08:30 IST)
దేశ రాజకీయాలపై సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో 40 శాతం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు నేర చరితులేనని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని ప్రజాస్వామ్యం అందామా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సిగ్గు పడాల్సిన విషయం అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
రాజ్యసభ సభ్యుడైన విజయేంద్ర ప్రసాద్ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 40 శాతం మంది క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.
 
నేర చరిత్ర లేని వాళ్ళకు గెలుపు అవకాశాలు కేవలం 4 శాతం మాత్రమేనని, అదే నేర చరిత్ర ఉన్నవారికి గెలుపు అవకాశాలు 15 శాతంగా ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతుందని ఆయన వెల్లడించారు. దీన్ని మనం ప్రజాస్వామ్యం అని ఎలా అంటామని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం కానేకాదు. సిగ్గుపడాల్సిన విషయం అని విమర్శించారు.
 
రాజ్యాంగంలో మార్పు చేస్తే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడలేరని విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎవరైనా ఆలోచించాలని, తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్‌తో పాటు లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments