Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయినా ఫోనులో మాట్లాడుతోందని మందలించిన తల్లి... పురుగుల మందుతాగి.. .

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (16:28 IST)
పెళ్లయినా ఫోనులో మాట్లాడుతోందని తల్లి మందలించింది. దీంతో ఆ మహిళ మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన విజయవాడ ఆగిరిపల్లి వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆగిరిపల్లి గ్రామానికి చెందిన రమ్య (25) అనే యువతికి మేనమామ కుమారుడితో వివాహమైంది. యేడాది నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. రమ్య నర్సుగా పనిచేస్తోంది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం రమ్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండగా తల్లి వద్దని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన రమ్య పొలానికి వెళ్లి అక్కడ ఉన్న కలుపు మందు తాగింది. 
 
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై పి.కిషోర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments