పదో తరగతి అమ్మాయిని పెళ్లాడిన టీచర్.. అసలు సంగతి ఎప్పుడు తెలిసిందంటే..?

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (13:48 IST)
టీచర్‌ను పెళ్లాడిన యువతికి షాక్ తప్పలేదు. ప్రేమ మాయలో పడి పెళ్లి చేసుకుని కాపురం పెట్టిన ఆ యువతికి.. అతనికి ముందే పెళ్లై భార్యాపిల్లలున్నారని తెలిసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, తాడిగడపకు చెందిన యువతి కొన్నేళ్ల క్రితం స్థానిక అయ్యప్ప నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ చదివింది. అదే సమయంలో తోడేటి సురేష్ అనే వ్యక్తి అక్కడే టీచర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో యువతిని ట్రాప్ చేసిన సురేష్.. ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. అంతేకాకుండా గత ఏడాది సెప్టెంబర్ 10న నెల్లూరు జిల్లా కావలికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అక్కడే కాపురం పెట్టాడు.
 
కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. సురేష్ కు గతంలోనే పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని యువతికి తెలిసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న బాధితురాలు.. భర్తని నిలదీసింది. 
 
దీంతో అప్పటి నుంచి ఆమెను శారీరకంగా మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. సురేష్‌తో పాటు అతడి సోదరి, మేనల్లుడు కూడా హింసలకు గురిచేశారు. అక్కడితో ఆగకుండా ఆమెపై వాట్సాప్, ఫేస్ బుక్‌లో అసభ్యంగా ప్రచారం చేశారు.
 
దీంతో విసిగిపోయిన ఆమె వారి నుంచి తప్పించుకొని తాడిగడపలోని పుట్టింటింకి చేరుకుంది. తల్లిదండ్రుల సాయంతో పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సురేష్ బాబుతో పాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments