Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేశావ్ కదా... 20 యేళ్లు జైల్లోనే ఉండు...

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (08:41 IST)
బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయిగా తేలిన ఓ కామాంధుడికి 20 యేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఐదు వేల రూపాయల అపరాధం కూడా విధించింది. అలాగే, బాధితురాలికి రూ.5 లక్షల మేరకు పరిహారం ఇచ్చేలా చూడాలని ఆదేశించింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
 
విజయవాడ రూరల్ మండలం వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి గ్రామానికి చెందిన సంగెపు నవీన్ (23) అనే వ్యక్తి గత 2019 సెప్టెంబరు 16వ తేదీన స్థానికంగా ఉండే ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను నయానో భయానో బెదిరించాడు. 
 
అయితే, అత్యాచారం ఇంటికి వచ్చిన ఆ బాలిక నీరసంగా, ముభావంగా ఉండటాన్ని తల్లి గమనించి, ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన విజయవాడలోని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్ రజిని తీర్పును వెలువరించారు. 
 
ముద్దాయికి 20 యేళ్ల జైలుతో పాటు 5 వేల రూపాయల అపరాధం కూడా విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే, బాధిత బాలికకు 4 లక్షల రూపాయల పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments