Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త లారీ డ్రైవర్.. వరుసకు మరిదితో భార్య షికార్లు.. బైకును లారీతో ఢీకొట్టి?

భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతోంది. అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా వివాహేతర సంబంధాలు నేరాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో వేరొక వ్యక్తితో బైకులో షికార్లు చేస్తూ కనిపించిన భార్యను భర్త లార

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (08:54 IST)
భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతోంది. అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా వివాహేతర సంబంధాలు నేరాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో వేరొక వ్యక్తితో బైకులో షికార్లు చేస్తూ కనిపించిన భార్యను భర్త లారీతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన రమణమ్మ-తవిటయ్య దంపతులు. 
 
తవిటయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా నిత్యం లారీపైనే ఉండే తవిటయ్యకు భార్యపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో భార్యకు ఫోన్ చేసి సుభద్రాపురం జంక్షన్‌కు వస్తే డబ్బులిస్తానని చెప్పాడు. భర్తను కలిసేందుకు రమణమ్మ, మరిది వరసైన రామకృష్ణతో కలసి బైక్‌పై సుభద్రాపురం బయలుదేరింది. 
 
వారిద్దరినీ చూసిన తవిటయ్యలో అనుమానం మరింతగా పెరిగింది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన అతడు.. లారీతో వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ  ఘటనలో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments