Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం ఖాళీ చేస్తామని అద్దెకు దిగారు.. తీరాచూస్తే...

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (10:48 IST)
విజయవాడ నగరంలో విషాదం జరిగింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ ఓ ప్రేమ జంట గదిని అద్దెకు తీసుకున్నారు. తీరా సాయంత్రం లాడ్జి సిబ్బంది వెళ్ళి చూస్తే ఆ ప్రేమ జంట పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడివున్నారు. 
 
ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని ఓ లాడ్జికి రెండు రోజుల క్రితం ఓ ప్రేమజంట వచ్చింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. అయితే, ఏంజరిగిందో ఏమో తెలియదుగానీ, తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును వారిద్దరూ సేవించారు. 
 
అయితే, సాయంత్రం గదిని ఖాళీ చేస్తామన్న ప్రేమ జంట ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది తలుపులు తట్టగా వారు తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఆ ప్రేమజంట పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. వీరిలో ప్రియురాలు చనిపోయింది. 
 
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మృతురాలు విజయవాడ సమీపంలో ని ఓ ప్రైవేటు కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఈ ఆత్మహ్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments