Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం ఖాళీ చేస్తామని అద్దెకు దిగారు.. తీరాచూస్తే...

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (10:48 IST)
విజయవాడ నగరంలో విషాదం జరిగింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ ఓ ప్రేమ జంట గదిని అద్దెకు తీసుకున్నారు. తీరా సాయంత్రం లాడ్జి సిబ్బంది వెళ్ళి చూస్తే ఆ ప్రేమ జంట పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడివున్నారు. 
 
ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని ఓ లాడ్జికి రెండు రోజుల క్రితం ఓ ప్రేమజంట వచ్చింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. అయితే, ఏంజరిగిందో ఏమో తెలియదుగానీ, తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును వారిద్దరూ సేవించారు. 
 
అయితే, సాయంత్రం గదిని ఖాళీ చేస్తామన్న ప్రేమ జంట ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది తలుపులు తట్టగా వారు తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఆ ప్రేమజంట పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. వీరిలో ప్రియురాలు చనిపోయింది. 
 
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మృతురాలు విజయవాడ సమీపంలో ని ఓ ప్రైవేటు కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఈ ఆత్మహ్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments