Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మెడకు రిబ్బన్‌ బిగించి ప్రాణాలు తీశాడు.. ఇంటి వెనుకనే పాతిపెట్టిన భర్త

విజయవాడలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన కసాయి భర్త మృతదేహాన్ని ఇంటి వెనుకనే పాతిపెట్టాడు. విజయవాడ వాంబే కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కాలనీలో నివసించే తేపల్లి కుమారమ్మ మూడో

Webdunia
సోమవారం, 15 మే 2017 (09:51 IST)
విజయవాడలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన కసాయి భర్త మృతదేహాన్ని ఇంటి వెనుకనే పాతిపెట్టాడు. విజయవాడ వాంబే కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కాలనీలో నివసించే తేపల్లి కుమారమ్మ మూడో కుమార్తె మరియమ్మ (30)కు అదేప్రాంతంలో విద్యుత్‌ పనులు నిర్వహించే దుర్గాప్రసాద్‌(35)తో 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుర్గాప్రసాద్‌ స్థానిక రాజీవ్‌నగర్‌లో నివసించే ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరియమ్మ భర్తను నిలదీయడంతో భార్యను భర్త వేధించసాగాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మరియమ్మ నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.
 
ఈపరిస్థితుల్లో దుర్గాప్రసాద్‌ భార్యను కలిసి.. ఇక నుంచి బుద్దిగా ఉంటానని, పూర్తిగా మారిపోయానంటూ నమ్మపలికాడు. దీంతో ఇద్దరూ కలిసి రెండు నెలల క్రితం వాంబే కాలనీలో అద్దెకు దిగారు. రెండురోజుల గడిచిన తర్వాత భర్త మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. అదేసమయంలో భార్య అడ్డు తొలగించుకోవాలని దుర్గారావు నిర్ణయించుకున్నాడు. 
 
అదనుచూసి ఒకరోజు మరియమ్మ మెడకు రిబ్బన్‌ బిగించి ప్రాణాలు తీశాడు. అనంతరం ఇంటి వెనుక ఖాళీ స్థలంలో ఐదడుగుల మేర గొయ్యి తవ్వి భార్య మృతదేహాన్ని పాతిపెట్టాడు. మరుసటిరోజు ఉదయం తాపీ కార్మికులను పిలిపించి.. ఆ గోతిపై గట్టు నిర్మించాడు. నాటి నుంచి భార్య వివరాలు అడిగిన ఇరుగుపొరుగుకు ఏవో కారణాలు చెబుతూ వచ్చాడు. 
 
కుమార్తె నెల రోజులుగా కనిపించకపోవడంతో మృతురాలి తల్లి కుమారమ్మ శనివారం ఉదయం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. అల్లుడిపై అనుమానంగా ఉందని చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments