Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు భార్య దత్తత తీసుకున్న గ్రామంలో చిత్తుగా ఓడిన తెదేపా : విజయసాయి ట్వీట్

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (13:10 IST)
ఏపీలో జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో మంత్రి కొడాలి నాని, వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత గ్రామాల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీ చిత్తుగా ఓడిపోయిందని టీడీపీ ఎద్దేవా చేస్తే... ఆ ఊరికి, తనకు సంబంధమే లేదని కొడాలి నాని చెప్పుకొచ్చారు. తన తండ్రి, తాను గుడివాడలోనే పుట్టామన్నారు. అలాగే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఊర్లో కూడా టీడీపీ గెలుపొందిందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పేందుకు చంద్రబాబు భ్రమ రాజకీయాలు చేస్తున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. 
 
పచ్చ కుల మీడియాలో అసత్య వార్తలు వేయించినంత మాత్రాన పంచాయతీలను టీడీపీ గెలుచుకున్నట్టేనా? అని ప్రశ్నించారు. మీ భార్య దత్తత తీసుకున్న కొమరవోలులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారని అన్నారు. మీ అత్తగారి జిల్లాలో కూడా వైసీపీ ప్రభంజనమే బాబూ అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments