మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. 24 గంటల్లో 4వేల పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:46 IST)
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కొంత తగ్గింది. కానీ మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 4 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజులో 40 మంది మరణించారు. 
 
ఇప్పటి వరకు మహారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య 20,64,278కి చేరింది. ఇక ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 51,529కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజులో సుమారు 1,355 మంది రోగులను డిశ్చార్జ్ చేశారు. దీంతో రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 19,75,603కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 35,965 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
 
అయితే భారతదేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11,649 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,09,16,589కు చేరుకుంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 90 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,55,732గా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి 1,06,21,220 మంది పూర్తిగా కోలుకున్నారు.
 
 ప్రస్తుతం దేశంలో 1,39,637 యాక్టివ్ కేసులున్నాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతుండటంతో కరోనాను భారత్ నియంత్రించగలుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments