Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి ప్రాణం తీసిన నులిపురుగుల మందు

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (10:40 IST)
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. నులిపురుగుల మందు ఓ చిన్నారి ప్రాణంతీసింది. చిన్నారుల కడుపులో ఉండే నులిపురుగులు చావడానికి పోసే మందే.. చివరకు ఆ చిన్నారి ప్రాణమే తీసింది. ఇందుకు కారణమైన ఏఎన్ఎంతో పాటు అంగన్‌వాడీ ఉద్యోగిని వైద్యాధికారులు సస్పెండ్ చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గరుగుబిల్లి మండలం కొట్నాన రామినాయుడువలస గ్రామంలో గురువారం నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించాడు. ఇందులోభాగంగా రామినాయుడువలస గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. 
 
ఈ శిబిరంలో అంగన్‌వాడీ, ఏఎన్ఎంలు చిననారులకు నులి పురుగుల నివారణ మందులను వేశారు. గ్రామానికి చెందిన రెండేళ్ళ బాలుడు కొట్నాన జశ్విక్ నాయుడును నాన్నమ్మ శిబిరం వద్దకు తీసుకొచ్చింది. 
 
మేము త్వరగా వెళ్లిపోవాలని, మాత్ర ఇవ్వాలని కోరింది. అంగన్‌వాడీ వర్కరు, ఏఎన్ం ఓ మాత్ర తీసి ఆమెకు ఇచ్చారు. బాలుడికి సగం ముక్క వేయాలని సూచించారు.

వారు చెప్పినట్టుగానే మాత్రను రెండు ముక్కలు చేసి ఒక భాగాన్ని బాలుడికి వేసింది. మాత్ర మింగించిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments