Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాకేజీ వస్తే పంచుకుందామని పాకులాడుతున్నారు : చంద్రబాబుపై విజయసాయి ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు టిడిపి ఎంపిలు పట్టుకున్న ప్

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు టిడిపి ఎంపిలు పట్టుకున్న ప్లకార్డులలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న విషయమే లేదన్నారు. 
 
ప్రత్యేక ప్యాకేజీ కోసం తెదేపా పాకులాడుతోందని, ప్యాకేజీని విదేశాలకు మళ్ళించేందుకే టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక్క వైసిపి మాత్రమే ఎపికి రావాల్సిన అన్నింటిపైన అలుపెరగని పోరాటం చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. 
 
మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పార్లమెంట్ సెషన్స్‌లో ప్రత్యేక హోదా ఆందోళనను ఉధృతం చేస్తామని, ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ఎవరు ముందుకు వచ్చినా కలిసి వెళతామన్నారాయన. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశంపార్టీ  ఏ మాత్రం పోరాటం చేయడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments