Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ చేరుకున్న ఉపరాష్ట్రపతి

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (13:24 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఘన స్వాగతం పలికారు.

ప్రత్యేక దళాలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి గౌరవ వందనం సమర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుండి వెంకయ్యనాయుడు ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కి బయలుదేరి వెళ్లారు. నాలుగు రోజులు పాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు. 

కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో 30న నిర్వహించే డాక్టర్‌ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. 31న విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రామ్మోహన్‌ గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. 
నవంబరు 1న చినఆవుటపల్లిలోని డాక్టర్‌ పిన్నమనేని సిద్థార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

అదే రోజ సాయంత్రం ఐఐపీఏ సర్వసభ్య సమావేశానికి వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతారు. నవంబరు 2న విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments