Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఒక్కరే మోదీపై పోరాటం చేస్తుంటే.. జగన్, కేసీఆర్‌లు? వీహెచ్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (16:05 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉగాది రోజున వీహెచ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని టార్గెట్ చేసిందని వీహెచ్ విమర్శించారు. 
 
ఎన్నికల సంఘం కక్ష్యసాధింపు చర్యలు చేపట్టడం కూడా అందులో భాగమేనని చెప్పారు. ఎన్నికలకు నాలుగురోజుల ముందు సీఎస్‌ను మార్చడం దేనికి సంకేతమని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతలా దిగజారి ప్రవర్తించడాన్ని తానెప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో మాత్రం ఏపీ తరహాలో అధికారులను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. 
 
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని బయట తిడుతున్న కేసీఆర్ లోపల మాత్రం అడ్జస్ట్ మెంట్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని ఓవైపు కేసీఆర్ తిడుతుంటే, మరోవైపు వైసీపీ అధినేత జగన్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. 
 
ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్రంపై ఒక్క చంద్రబాబు మాత్రమే నిజంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. పాత కేసులను మాఫీ చేసుకునేందుకు వైకాపా చీఫ్ జగన్ మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments