Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు జాతికే గర్వకారణం వెంకయ్య నాయుడు : డీకే అరుణ

Webdunia
సోమవారం, 19 జులై 2021 (08:49 IST)
తన ఆహార్యం మాట తీరుతో పంచకట్టుతో తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా దేశ రాజకీయాల్లో ప్రభాశీల వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారు భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడని బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు.

ఢిల్లీలో డీకే అరుణతో పాటు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ బిజేపీ ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి వెంకయ్యనాయుడిని మొదటిసారిగా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు ఎం వెంకయ్యనాయుడనీ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక హోదాల్లో పని చేసి మెప్పించిన వ్యక్తి ఆయన అని కొనియాడారు.

దేశంలో ఏ మూలన సంక్షోభం వచ్చినా.. నేనున్నానంటూ కదిలివచ్చి తనదైన శైలిలో సమస్యను పరిష్కరించే అపర మేధావని, అంతకుమించి తెలుగు జాతికే గర్వకారణమైన నేత అని వారు కొనియాడారు. ఇలాంటి ప్రముఖులు ఇప్పుడు దేశంలోని అత్యున్నత పదవుల్లో ఒకటైన భారత ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టనుండటం తెలుగువారి అదృష్టం అని డీకే అరుణ అన్నారు.

బిజెపి షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నప్పటికీ తమను ఎంతో ఆప్యాయంగా పలకరించడం తన జీవితంలో ఎంతోగొప్ప అనుభూతిగా మిగిలిందన్నారు.

వెంకయ్య నాయుడితో గతంలో అనేక ఎన్నికల ప్రచారంలో ఆయనతో కలిసి ఓ కార్యకర్తగా పని చేసిన  స్వీయానుభవం తనకున్నదని, ఒక సామాన్య కార్యకర్తకు ఆయన ఇచ్చే గౌరవం ఎనలేనిదని ప్రశంసించారు. ఓ సామాన్య వ్యక్తికి ఆయన ఇచ్చే గౌరవం ఇతరులకు నేర్పిన క్రమశిక్షణ లాంటిదని కొనియాడారు.

ఆయనను ఇంత గొప్పస్థాయికి చేర్చిందని, అందుకే దేశ అత్యున్నత పదవిని అలంకరించడం వెంకయ్యనాయుడుకె సాధ్యమైందని ఆయన తెలిపారు. ఒక తెలుగువాడిగా తను ఎంతో గర్వపడుతున్నా అని శ్రీవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments