Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామర్స్ కమిటీకి వెంకయ్య అభినందనలు

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:13 IST)
వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అధ్యక్షతన పని చేస్తున్న కామర్స్ పార్లమెంటరీ కమిటీ పనితీరును రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అభినందించారు. 

రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల విరామ సమయంలో పలుమార్లు సమావేశమై మంచి పని తీరును కనబరిచినందుకు 8 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ప్రధానంగా కామర్స్ కమిటీ పార్లమెంట్‌ విరామ సమయంలో 10 సమావేశాలు నిర్వహించి గతంలో కంటే మంచి పనితీరు ప్రదర్శించిందని అన్నారు. కామర్స్ కమిటీ సగటున 2 గంటల 37 నిమిషాల చొప్పున మొత్తం 26 గంటల 18 నిమిషాలపాటు సమావేశమైందని ఆయన తెలిపారు.

గతంలో కామర్స్ కమిటీ సమావేశాలు సగటున 1 గంట 42 నిమిషాలు మాత్రమే జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి కామర్స్ కమిటీ పనితీరులో గణనీయమైన పెరుగదల ఉన్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments