Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (15:01 IST)
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈ దంపతులు సీఎం బాబుకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఏపీ ప్రభుత్వం తితిదే పాలక మండలి సభ్యురాలిగా నియమించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తన భర్త, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వచ్చి సీఎంను కలిసి అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, ఆదివారం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి.నారాయణలు హాజరైన ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కానీ, ఆయనకు పుష్పగుచ్ఛం ఇవ్వకపోవడంతో ఆయన అలిగి వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రశాంతి రెడ్డి కూడా తన భర్త వెంట అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments