Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (15:01 IST)
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈ దంపతులు సీఎం బాబుకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఏపీ ప్రభుత్వం తితిదే పాలక మండలి సభ్యురాలిగా నియమించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తన భర్త, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వచ్చి సీఎంను కలిసి అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, ఆదివారం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి.నారాయణలు హాజరైన ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కానీ, ఆయనకు పుష్పగుచ్ఛం ఇవ్వకపోవడంతో ఆయన అలిగి వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రశాంతి రెడ్డి కూడా తన భర్త వెంట అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments