ఏలూరు వాసులకు శుభవర్త.. వందే భారత్‌కు స్టాపింగ్

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (10:06 IST)
ఏలూరు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖపట్టణం - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు ఇకపై ఏలూరు రైల్వే స్టేషన్‌లో కూడా ఆగుతుందని తెలిపింది. ఇది అదనపు స్టాప్. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
విశాఖపట్టణం - సికింద్రాబాద్ - విశాఖపట్టణం వందే భారత్ రైలుకు విజయవాడ నుంచి రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాఫ్ కూడా లేదు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇపుడు ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రయాణికులకు పెద్ద వెసులుబాటు కలగనుంది.
 
ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి ఏలూరుకు 9.49 గంటలుక చేరుకుంది. అటు విశాఖపట్టణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి ఏలూరుకు సాయంత్రం 5.55 గటంలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఈ వందే భారత్ రైలు ఆగి వెళ్లేలా అవకాశం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments