Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై మంత్రి ఉషశ్రీ హల్చల్... 50 మందితో దర్శనం

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (12:42 IST)
తిరుమల శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం సాధారణ భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. కానీ, అధికార వైకాపా నేతలు మాత్రం కొండపై ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ భక్తులతో తమకెలాంటి సంబంధం లేనట్టుగా, వారు పడే కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ తిరుమల కొండపై హల్చల్ సృష్టించారు. 
 
ఆమె ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి కొండపైకి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మరో 10 మంది అనుచరులు సుప్రభాతం టిక్కెట్లు పొందారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నప్పటికీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి తితిదే అధికారులు టిక్కెట్లను జారీచేశారని భక్తులు మండిపడుతున్నారు. పైగా, ఈ విషయాన్ని ప్రస్తావించిన జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె సెక్యూరిటీ సిబ్బంది వీడియో జర్నలిస్టులను కిందకు తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
కాగా వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రతి రోజూ కనీసం 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 92 వేల మంది భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments