Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహన మిత్ర లబ్దికి 6 వరకు దరఖాస్తులు

Webdunia
శనివారం, 3 జులై 2021 (09:02 IST)
ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2021-22 సంవత్సరానికి గానూ వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోని అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్ అన్నదమ్ముల సౌకర్యార్థం 6 జులై, 2021 వరకు దరఖాస్తు చేసుకునే తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ  చేసామని రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు పేర్ని నాని తెలిపారు. 
 
2021-22 సంవత్సరానికి గానూ 15 జూన్, 2021న 2,48,468 మంది వాహనదారులకు రూ.249 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి అందజేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకునే కాలాన్ని 6 జులై, 2021 వరకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.

వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అర్హులైన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములు మిగిలిపోయి ఉంటే 6 జులై, 2021 వరకు తమ తమ పరిధిలోని గ్రామ /వార్డు సచివాలయాల్లో అవసరమైన అన్ని పత్రాలు సమర్పించి, దరఖాస్తు చేసుకొని వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి  కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments