Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌కు సర్వీసు గండం... హోంశాఖకు ఫిర్యాదు!

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ విభాగం ఏడీజీగా సునీస్ కుమార్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు సర్వీస్ గండం ఏర్పడింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ సమస్య ఉత్పన్నమైంది. మతం మార్పుచుకున్న వారికి రిజర్వేషన్లు వర్తించవని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సునీల్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. 
 
సునీల్‌కుమార్‌ సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ... లీగల్‌ రెట్స్‌ అడ్వైజరీ(ఎల్‌ఆర్‌వో) కన్వీనర్‌ ఎన్‌ఐ జోషి ఫిర్యాదు చేశారు. ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్‌ పొంది... క్రిస్టియన్‌గా మతం మార్చుకున్న సునీల్‌కుమార్‌ను సర్వీస్‌ నుంచి తప్పించాలని అందులో పేర్కొన్నారు. మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‌ను వదలుకోవాలన్న... మద్రాస్‌ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‌కుమార్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని కోరారు. 
 
సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్‌ ఇండియా మిషన్‌ పేరుతో... సునీల్‌కుమార్‌ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పేర్కొన్నారు. అంబేద్కర్‌ మిషన్‌ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్‌ ప్రోత్సహించారని, సునీల్‌కుమార్‌పై సెక్షన్‌ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్‌ఐఆర్‌ సమోదు చేసి... పూర్తిస్థాయిలో హోంశాఖ దర్యాప్తు చేయాలని ఎల్‌ఆర్‌వో కన్వీనర్‌ ఎన్‌ఐ జోషి డిమాండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments