Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా చోరీ జరిగిందా? లేదా? ఆధార్ కీలక ప్రకటన

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన డేటా చోరీ కేసులో ఆధార్ సంస్థ ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆధార్ సర్వర్‌ల నుండి ఐటీ గ్రిడ్ సంస్థ ఎటువంటి డేటాను అక్రమంగా, చట్ట విరుద్ధంగా చోరీ చేయలేదని స్పష్టం చేసింది. బుధవారం దీనిపై యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ సంస్థకు సంబంధించిన కేంద్రీకృత సమాచార నిల్వ కేంద్రంతో పాటు సర్వర్‌లు అత్యంత భద్రతతో ఉన్నాయని తెలిపింది.
 
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేసిన విచారణలో ఆధార్ చట్టానికి విరుద్ధంగా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థ పెద్ద సంఖ్యలో పౌరుల వివరాలను సేకరించినట్లు నివేదిక ఇచ్చింది. సాధారణంగా చాలా సర్వీస్ ప్రొవైడర్లు నేరుగా వ్యక్తుల నుంచే వారి ఆధార్ డేటాను, ఇతర వివరాలు సేకరించడం జరుగుతోంది. 
 
అయితే సేకరించిన ఆ సమాచారాన్ని నిర్థిష్టంగా దేని కోసం సేకరించారో దాని కోసమే వినియోగించాలి. సదరు వ్యక్తుల సమ్మతం లేకుండా సేకరించిన సమాచారాన్ని ఇతరులకు అందించకూడదు. ఆధార్ చట్టానికి వ్యతిరేకంగా ఆ సమాచారాన్ని సేకరించినా, నిల్వ చేసినా, ఉపయోగించినా అందుకు బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చునని యూఐడీఏఐ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments