Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలను మోసుకెళ్లిన గాడిదలు..!

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:08 IST)
భారతదేశం ఎంతో ప్రగతి సాధించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్డు మార్గాలు సరిగా లేవు. ఫలితంగా అలాంటి ప్రాంతాల్లో రవాణాకు ప్రాచీన పద్ధతినే అవలంభిస్తున్నారు. అదే గాడిదలను వాహనాలుగా ఉపయోగిస్తున్నారు. త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురి జిల్లాలోని పెన్న‌గార‌ం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌ుగుతున్న ఎన్నిక‌ల కోసం ఎన్నిక‌ల సంఘం అధికారులు గాడిద‌ల‌ను వాడారు. 
 
కొట్టూరుమలై గ్రామానికి ఈవీఎంల‌ను మోసుకువెళ్లేందుకు నాలుగు గాడిద‌ల‌ను ఈసీ అధికారులు కిరాయి తీసుకున్నారు. హైవేకి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి రోడ్డు లేదు. ఆ ఊరికి వెళ్లడానికి వాహనాలు లేవు. అయితే ఈవీఎంల‌ను మోసుకెళ్లేందుకు గాడిద‌ల‌ను వాడాల్సి వ‌చ్చింది. ఆ ఊరిలో సుమారు 341 ఓట‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఈవీఎంల‌ను మోసుకెళ్లిన గాడిద‌ల‌కు సినిమా హీరోల పేర్లు పెట్టారు. వీటిని ర‌జ‌నీ, క‌మ‌ల్‌, అజిత్‌, విజ‌య్ అనే పేర్లతో పిలుస్తుంటారు. చిన్న‌స్వామి అనే వ్య‌క్తికి చెందిన గాడిద‌లు ఈవీఎంను మోసుకువెళ్లాయి. 1970 నుంచి ఆ గ్రామానికి గాడిద‌ల ద్వారానే ఎన్నిక‌ల సామాగ్రిని మోసుకువెళ్తున్న‌ట్లు అత‌ను చెప్పాడు. అయితే రోజూ ఒక గాడిద‌కు 2 వేలు రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments