Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో రోడ్డు ప్రమాదం - తెదేపా నేతల దుర్మరణం

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (10:54 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను భానుప్రకాష్ రెడ్డి, గంగపల్లి భాస్కర్‌గా గుర్తించారు. మరో నేత సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. 
 
చిత్తూరు జిల్లా పరిధిలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో చంద్రగిరి మండలం తెలుగు యువత అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్‌లు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న ఐటీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలియగానే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్ర  దిగ్భ్రాంతికి గురిచేసిందని, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోమశేఖర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments