Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాపులపాలెంలో ఫైనాన్స్ వ్యాపారిపై అర్థరాత్రి కాల్పులు

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (08:54 IST)
కోనసీమ జిల్లా రావులపాలంలో అర్థరాత్రి కలకలం చెలరేగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వారిని వ్యాపారి కుమారుడు ప్రతిఘటించాడు. అయినప్పటికీ వారు కాల్పులు జరపడంతో బాధితులు పెద్దగా కేకలు వేశారు. దీంతో దండుగులు అక్కడ నుంచి పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రావులపాలెంలో సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి బడా ఫైనాన్స్ వ్యాపారిగా చెలామణి అవుతున్నాడు. ఈయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి కాల్పులకు తెగబడ్డారు. తొలుత ఆయనపై దుండగులు కాల్పులు జరుపగా, ఆ తర్వాత సత్యనారాయణ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి వారిని ప్రతిఘటించడంతో నిందితులు గాల్లోకి కాల్పులు జరిపారు. 
 
దీంతో సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో ఓ దండుగుడి చేతి సంచి కిందపడిపోయింది. దీన్ని పరిశీలించగా, అందులో రెండు నాటు బాంబులు, జామర్‌లు ఉన్నాయి. ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments