Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంకిపాడులో ఇద్దరు బాలికల అదృశ్యం

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (18:14 IST)
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. స్థానిక జడ్పీటీసీ పాఠశాలకు చెందిన ఈ బాలికలు ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. వీరిద్దరినీ అదే గ్రామానికి చెందిన గుండి జోజి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ అదృశ్యమైన బాలికల్లోని ఒక విద్యార్థిని ఇంటి పక్కనే జోజి నివసిస్తుంటాడు. స్థానికంగా ఆర్క్‌ వెల్డర్‌గా పనిచేసే ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడని, వీరికి ఒక బాబు ఉండగా పది రోజుల క్రితం పాప జన్మించిందని పోలీసులు తెలిపారు. 
 
విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన బాలికలు అక్కడి నుంచి జోజితో కలిసి జనశతాబ్ది ట్రైన్‌లో చెన్నై వైపు వెళ్లినట్టు గుర్తించారు. వీరి కోసం 20 బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments