Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంకిపాడులో ఇద్దరు బాలికల అదృశ్యం

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (18:14 IST)
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. స్థానిక జడ్పీటీసీ పాఠశాలకు చెందిన ఈ బాలికలు ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. వీరిద్దరినీ అదే గ్రామానికి చెందిన గుండి జోజి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ అదృశ్యమైన బాలికల్లోని ఒక విద్యార్థిని ఇంటి పక్కనే జోజి నివసిస్తుంటాడు. స్థానికంగా ఆర్క్‌ వెల్డర్‌గా పనిచేసే ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడని, వీరికి ఒక బాబు ఉండగా పది రోజుల క్రితం పాప జన్మించిందని పోలీసులు తెలిపారు. 
 
విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన బాలికలు అక్కడి నుంచి జోజితో కలిసి జనశతాబ్ది ట్రైన్‌లో చెన్నై వైపు వెళ్లినట్టు గుర్తించారు. వీరి కోసం 20 బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments