Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ : పదవులకు రాజీనామాలు చేసిన బీజేపీ మంత్రులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన బీజేపీ ఎమ్మెల్యేలు తమతమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే తమ గుర్తింపు కార్డులతో పాటు.. ప్రభుత్వ వాహనాల

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (09:01 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన బీజేపీ ఎమ్మెల్యేలు తమతమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే తమ గుర్తింపు కార్డులతో పాటు.. ప్రభుత్వ వాహనాలను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇప్పటివరకూ భాగంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు తమ అధికారిక వాహనాలను, ఐడీ కార్డులను వెనక్కు ఇచ్చేశారు. 
 
బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని బీజేపీ నిర్ణయించుకుంది. 
 
ఈ మేరకు బీజేపీ హైకామండ్ నుంచి వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం తమ అధికారిక వాహనం, మంత్రులుగా తెలిపే గుర్తింపు కార్డులను వారు ప్రభుత్వానికి అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments