Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లా కోర్టులో చోరీ : ఇద్దరు అరెస్టు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (15:03 IST)
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చోరీ కేసులో ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. ఈ సందర్భంగా చోరీకి గురైన వస్తువులన్నింటినీ రికవరి చేశామని ఆయన తెలిపారు. 
 
ఈ కోర్టులో జరిగిన చోరీ కేసులో పాత నిందితులు సయ్యద్‌ హయత్‌, ఖాజా రసూల్‌ను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీకి వెళ్లిన ఇద్దరిని కుక్కలు వెంబడించడంతో కోర్టులోకి వెళ్లారని వివరించారు. అనంతరం కోర్టు తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలోని బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారని పేర్కొన్నారు.
 
బెంచ్‌ క్లర్క్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారని తెలిపారు. విచారణలో భాగంగా ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని, సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసు ఛేదించామని వివరించారు. 
 
వీరి నుంచి నిందితులిద్దరిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి ట్యాబ్‌, ల్యాప్‌ట్యాప్‌, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. కోర్టులో చోరీకి గురైన అన్నింటినీ రికవరీ చేశామన్నారు. ఇద్దరు నిందితులపై 14 పాత కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments