Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషాదం మిగిల్చిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (19:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ విషాదం మిగిల్చింది. కాబోయే వధూవరులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో జరిగింది. 
 
ఈ జిల్లాలోని అబ్దుల్లా పూర్‌మెంట్ మండల్ కోహెడ గ్రామంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌ కోసం వధూవరులు వెళ్ళారు. వీరు ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో షూట్‌ ఎఫెక్టివ్‌గా ఉండటం కోసం పొగ పెట్టారు. దీంతో తేనెటీగలు పెళ్లికొడుకు, పెళ్లికూతురుపై దాడికి దిగాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. 
 
బాధితులు హైదరాబాద్‌లోని మాలక్‌పేట యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరో రెండు రోజుల్లో పెండ్లి బాజా భజంత్రీలతో సందడిగా మారాల్సిన ఆ గృహాల్లో ఇప్పుడు ఇలా జరగడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments