Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ9 నకిలీ విలేకరి అరెస్ట్; బ్యాగులో గంజాయిని త‌ర‌లిస్తూ...

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:39 IST)
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం లో ఎస్.వి.వి.ఎస్.డి డిగ్రీ కాలేజీ వద్ద బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా, దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. త‌ను టీవీ 9 క్రైం రిపోర్ట్ అని చెప్పుకొంటూ, ఆ  పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరిని అన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. 
 
త‌ను టీవీ 9 క్రైమ్ జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ, పలువురిని బెదిరించి, దుర్గాప్ర‌సాద్ డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నకిలీ విలేకరి మండపేట కు చెందిన పెద్దిరెడ్డి దుర్గా ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. అన్నవరం కొండ పై ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్న సమయంలో వారిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేశాడు ఈ నకిలీ విలేకరి. యువకుడు ఫిర్యాదుతో ఈ విలేక‌రి బాగోతం వెలుగులోకి వచ్చింది. 
 
దీనితో అన్న‌వ‌రం పోలీసులు ఇత‌నిపై నిఘా పెట్టారు. ఈసారి త‌ను శంఖవరం మండలంలో ఎస్.వి.వి.ఎస్.డి డిగ్రీ కాలేజీ వద్ద బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా, పోలీసులు ప‌ట్టుకున్నారు. వారికి కూడా త‌ను టీవీ 9 క్రైం రిపోర్ట‌ర్ ని అని దుర్గాప్ర‌సాద్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీనితో ఈ న‌కిలీ రిపోర్ట‌ర్ ని అరెస్టు చేసి ఊచ‌లు లెక్క‌బెట్టిస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments