Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ9 నకిలీ విలేకరి అరెస్ట్; బ్యాగులో గంజాయిని త‌ర‌లిస్తూ...

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:39 IST)
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం లో ఎస్.వి.వి.ఎస్.డి డిగ్రీ కాలేజీ వద్ద బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా, దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. త‌ను టీవీ 9 క్రైం రిపోర్ట్ అని చెప్పుకొంటూ, ఆ  పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరిని అన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. 
 
త‌ను టీవీ 9 క్రైమ్ జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ, పలువురిని బెదిరించి, దుర్గాప్ర‌సాద్ డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నకిలీ విలేకరి మండపేట కు చెందిన పెద్దిరెడ్డి దుర్గా ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. అన్నవరం కొండ పై ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్న సమయంలో వారిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేశాడు ఈ నకిలీ విలేకరి. యువకుడు ఫిర్యాదుతో ఈ విలేక‌రి బాగోతం వెలుగులోకి వచ్చింది. 
 
దీనితో అన్న‌వ‌రం పోలీసులు ఇత‌నిపై నిఘా పెట్టారు. ఈసారి త‌ను శంఖవరం మండలంలో ఎస్.వి.వి.ఎస్.డి డిగ్రీ కాలేజీ వద్ద బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా, పోలీసులు ప‌ట్టుకున్నారు. వారికి కూడా త‌ను టీవీ 9 క్రైం రిపోర్ట‌ర్ ని అని దుర్గాప్ర‌సాద్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీనితో ఈ న‌కిలీ రిపోర్ట‌ర్ ని అరెస్టు చేసి ఊచ‌లు లెక్క‌బెట్టిస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments