టిటిడిని బిజెపి రాజకీయంగా వాడుకుంటుందా?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (15:52 IST)
ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీవారి భూముల విక్రయానికి సంబంధించిన వ్యవహారమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భూముల విక్రయం జరగకపోయినా టిటిడి పాలకమండలి రెజల్యూషన్ ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిజెపితో పాటు హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. 
 
దీంతో రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదంతా బాగానే ఉంది. కానీ భారతీయ జనతాపార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం రాష్ట్రవ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేయడమే ఇప్పుడు అసలు చర్చ. ఇందులో కొత్త ట్విస్ట్. గతంలో టిటిడి పాలకమండలి సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి బిజెపి నేత. 
 
గతంలో పాలకమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు శ్రీవారి భూముల విక్రయానికి సంబంధించి తీర్మానంలో ఆయన సంతకం కూడా చేశారు. ఇది కాస్త పెద్ద చర్చకు దారితీస్తోంది. అప్పుడు పాలకమండలి సభ్యుడిగా ఆమోదించి ఇప్పుడు వ్యతిరేకించడం ఏమిటని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
 
రాజకీయంగా ఎదగడానికి టిటిడిని అడ్డుపెట్టుకుంటున్నారని.. బిజెపికి ఇది అలవాటుగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు. గతంలో టిటిడి విషయంలోను బిజెపి అతిగా స్పందించిందన్న ప్రచారం లేకపోలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వైసిపి నేతలు బిజెపిపై ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరి చూడాలి ఎపిలో రెండు పార్టీల మధ్య ఈ వ్యవహారం ఏ స్థాయికి తీసుకెళుతుందో. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో చిత్రం ప్రకటన

Hema: ఆ టైంలో మా ఇంటికి పనిమనిషి కూడా రానంది : హేమ ఆవేదన

Dhurandhar sequel collections:: ధురందర్ ది రివెంజ్ 11 రోజుల్లోనే ₹1365 కోట్లను వసూలు చేసింది

Sesh Adavi: డెకాయిట్‌ చిచ్చుబుడ్డి ఫుల్ సాంగ్ లో మెరిసిన అడివి శేష్, జోనితా గాంధీ, పవన్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

తర్వాతి కథనం
Show comments