Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో తితిదే విజిలెన్స్ విభాగ అధికారి మృతి.. ముందు కరోనా ఆపై నెగెటివ్....

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:37 IST)
చెన్నైలో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తితిదే అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిజానికి ఈయన కరోనా వైరస్ బారినపడి ఆ తర్వాత కోలుకున్నారు. ఇంతలోనే ఆయన చనిపోవడం వైద్యులను కూడా ఆశ్చర్యానికి లోను చేసింది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అసిస్టెంట్ విజిలెన్స్-సెక్యూరిటీ అధికారిగా వి.మహేశ్వరరావు పని చేస్తున్నారు. ఈయనకు కరోనా వైరస్ లక్షణాలతో గత జూలై నెల 28వ తేదీన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు నుంచి ఈయన కొంత అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో రెండ్రోజుల కిందట నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ అని రావడంతో, ఆయన త్వరలోనే డిశ్చార్జి అయి, విధుల్లో చేరతారని టీటీడీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కానీ ఆలయ వర్గాల్లో విషాదం నింపుతూ ఆ అధికారి మృతి చెందారు. మహేశ్వరరావు మృతిపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చీఫ్ విజిలెన్స్-సెక్యూరిటీ ఆఫీసర్ జెట్టి గోపీనాథ్, ఇతర అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments