Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (15:51 IST)
తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి తితిదే చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను వేగవంతం చేసినట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
అలాగే, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ డిసెంబరు నుంచి మార్పులు చేస్తామని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
 
సర్వదర్శనం టోకెన్ల జారీపై తితిదే ఈవో ధర్మారెడ్డి వివరాలను వెల్లడించారు. తిరుతిలో శ్రీనివాస్, గోవిందరాజు, భూదేవి సత్రాల్లో నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ టోకెన్ల జారీ ఉంటుందని ఆయన తెలిపారు. రోజువారీ కోటా చొప్పున టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. 
 
సోమ, బుధ, గురు, ఆదివారాల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు చొప్పున అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం