Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లను విడుదల చేసిన తితిదే

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (21:38 IST)
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రోజుకు 20 వేల టికెట్ల చొప్పున జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు రూ.300 టికెట్లను తితిదే వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
 
ఒక యూజర్‌ ఐడీ నుంచి ఆరు టిక్కెట్ల వరకూ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్న తితిదే నెలకొకసారి టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తోంది. 
 
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తితిదే ఈ నెల 25 నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఈ కార్యక్రమం జనవరి 4వ తేదీ వరకూ జరగనుంది. కరోనా దృష్ట్యా తొలుత స్థానికులకే వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని ప్రకటించిన తితిదే అనంతరం క్యూలైన్లలో నిల్చున్న వారికి సైతం టోకెన్లను జారీ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments