Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై పోరుకు టీటీడీ భారీ విరాళం, ఎపి సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 19 కోట్లు

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:20 IST)
కరోనాను అరికట్టేందుకు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తూనే ఉన్నారు. ఆయా ప్రభుత్వాలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. కరోనాపై పోరుకు టీటీడీ కూడా భారీ విరాళం ప్రకటించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున రూ. 19 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్నట్టు ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే మొదటి విడతగా చిత్తూరు జిల్లా అధికారులకు రూ. 8 కోట్లు ఇచ్చామని… మిగితా రూ. 11 కోట్లను ఏపీ ప్రభుత్వ సమాయ నిధికి బదిలీ చేస్తామని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా నిరాశ్రయులు అయిన వారికి ఆహారం అందిస్తున్నట్టు చెప్పారు.

ప్రతి రోజు యాచకులు, కూలీలు, పేద వారి కోసం ప్రత్యేకంగా లక్షా 20 వేల ఆహారపు ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకూ తమ వంతు సాయం చేస్తూనే ఉంటామన్నారు.

అంతేకాదు తిరుమలలో స్వామివారి దర్శనం నిలిపేశామన్న అనిల్ సింఘాల్ ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి జరగాల్సిన అన్నీ నిత్యపూజలు జరుగుతున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments