Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్న బంగారు ఏ బ్యాంకులో.. ఎంత జమచేశారో తెలుసా...!

ఆపదమ్రొక్కుల వాడు వెంకన్నకు భక్తులకు సమర్పించే బంగారాన్ని మొత్తాన్ని బ్యాంకుల్లోకి సురక్షితంగా చేర్పించి తితిదే. 970.080 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో గోల్డ్ మానిటైజేషన్ పథకంలో డిపాజిట

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (10:01 IST)
ఆపదమ్రొక్కుల వాడు వెంకన్నకు భక్తులకు సమర్పించే బంగారాన్ని మొత్తాన్ని బ్యాంకుల్లోకి సురక్షితంగా చేర్పించి తితిదే. 970.080 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో గోల్డ్ మానిటైజేషన్ పథకంలో డిపాజిట్ చేసింది. 2016 మార్చిలో తొలుత తితిదే ఈ బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండ ఇండియాలో డిపాజిట్ చేసింది. కాలపరిమితి పూర్తి కావడంతో వడ్డీ రూపంలో వచ్చిన బంగారాన్ని కలిపి తిరిగి అదే బ్యాంకులో గోల్డ్ మానిటైజేషన్ పథకంలో ఒక శాతం వడ్డీతో 3 సంవత్సరాల కాలానికి స్వల్పకాలిక డిపాజిట్ చేసింది.
 
ఎస్‌బిఐ ఎండి రజనీష్‌ కుమార్ ఈ మేరకు తితిదే బంగారం డిపాజిట్ చేసిన పత్రాలను ఈఓ డి.సాంబశివరావుకు అందజేశారు. శ్రీవారి హుండీ కానుకల రూపంలో అందిన మిక్స్ డ్ కేటగిరి బంగారు నగలు, వస్తువులు కలిపి దాదాపు 1400 కిలోలను ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో 1.25 శాతం వడ్డీకి తితిదే డిపాజిట్ చేశారు. 
 
దీనిని మూడు సంవత్సరాల కాలపరిమితికి గోల్డ్ మానిటైజేషన్‌ పథకంలో స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ కేటగిరిలో డిపాజిట్ చేసింది. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1311 కిలోల 0.995 స్వచ్ఛత గల బంగారు కడ్డీలను 1.57 శాతం వడ్డీకి తితిదే డిపాజిట్ చేసింది. దీన్ని మూడు సంవత్సరాల కాలపరిమితికి గోల్డ్ మానిటైజేషన్ పథకంలో స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ కేటగిరిలో డిపాజిట్ చేసింది. స్వచ్ఛమైన బంగారం కేటగిరిలో ఈ బ్యాంకు చెల్లిస్తున్న వడ్డీ ఇదే అత్యధికం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments